తమ పిల్లలపై తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు.. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని, గొప్ప విద్యావంతులు చేయాలని కలలు కంటుంటారు.. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు షాక్ ఇస్తే.. ఇక వారు పడే మానసిక వేదన వర్ణనాతీతం
తమ పిల్లలపై తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు.. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని, గొప్ప విద్యావంతులు చేయాలని కలలు కంటుంటారు.. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు షాక్ ఇస్తే.. ఇక వారు పడే మానసిక వేదన వర్ణనాతీతం
విధాత బ్యూరో, కరీంనగర్: తమ పిల్లలపై తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు.. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని, గొప్ప విద్యావంతులు చేయాలని కలలు కంటుంటారు.. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు షాక్ ఇస్తే.. ఇక వారు పడే మానసిక వేదన వర్ణనాతీతం. ఇలాంటి ఘటనే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరి మురళి తన కూతురు అనూషను బీటెక్ చదివిస్తున్నారు. తమ బిడ్డ చక్కగా చదువుకుంటుందనుకుంటున్న, మురళి పిడుగు లాంటి వార్త విన్నారు. తాను ప్రేమించిన యువకుడిని అనూష పెళ్లి చేసుకొని వెళ్లడంతో, బాధను తట్టుకోలేని మురళి తన బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ తయారు చేయించి ఇంటిముందు గోడకు ప్రదర్శించి
ఆవేదన తెలియజేశారు.
కళాశాలలోని విద్యార్థితో పరిచయం ప్రేమగా మారడంతో, విష్ణు తెలిసిన అనూష తల్లిదండ్రులు ఆమెను మందలించి బుద్ధిగా చదువుకోవాలని నచ్చచెప్పారు. అయితే తల్లిదండ్రుల మాటను పక్కన పెట్టిన అనూష ఆదివారం తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.
విషయం తెలిసిన వెంటనే విషయం తెలిసిన వెంటనే అనూష తండ్రి మురళి ‘నా బిడ్డ వెళ్ళిపోయింది, దొంగలు మోసం చేశారు.. ట్రాప్ చేశారు.. ఏ బిడ్డ కూడా తమ తల్లిదండ్రులకు ఇలాంటి అన్యాయం చేయొద్దంటూ’కన్నీటి పర్యంతమయ్యారు. ‘మీ పిల్లలను అన్యాయం చేసుకోవద్దు, వారిని జాగ్రత్తగా గమనించండి అంటూ, తమ కుటుంబానికి ఎదురైన పరిస్థితి మరొకరికి రాకూడదని వేడుకున్నారు.