కీసర మండలం చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చీర్యాల లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
విధాత : కీసర మండలం చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు పడి..కరువు అంతమై..పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకోవడం జరిగిందని కోమటిరెడ్డి పేర్కోన్నారు.