విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని సూరారం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తి దాడిలో ప్రభాకర్రెడ్డికి కడుపులో గాయమైంది.
వెంటనే తేరుకున్న బీఆరెస్ కార్యకర్తలు ఆ వ్యక్తికి పట్టుకునుఇ కొట్టడంతో కింద పడిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.