తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు. కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలు, డైరెక్టర్ అరవింద్ సింగ్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. కేసీఆర్భు స్వయంగా కలిసి ఆహ్వానించాలని సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు సోనియాగాంధీ ప్రత్యేక అతిధిగా హాజరుకాబోతుండటం విశేషం.