Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ట్రైన్స్ను దాదాపు నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దు చేసిన రైళ్లలో ప్యాసింజర్, ఎక్స్ప్రెస్లు సహా సూపర్ఫాస్ట్ రైళ్లు సైతం ఉన్నాయి. అయితే, ఈ రైళ్ల రద్దుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు.
Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ట్రైన్స్ను దాదాపు నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దు చేసిన రైళ్లలో ప్యాసింజర్, ఎక్స్ప్రెస్లు సహా సూపర్ఫాస్ట్ రైళ్లు సైతం ఉన్నాయి. అయితే, ఈ రైళ్ల రద్దుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. అయితే, కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మార్గంలో సిగ్నల్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైళ్లను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణంగా బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొట్టాయి.
ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సిగ్నల్ వ్యవస్థను రైల్వేశాఖ ఆధునికీకరిస్తూ వస్తున్నది. ఇక రద్దయిన రైళ్ల విషయానికి వస్తే కాజీపేట-కాగజ్నగర్ (17003) రైలు ఈ నెల 17 నుంచి జులై 6 వరకు రద్దు అయ్యింది. కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ (12757-12558) ఈ నెల 23 నుంచి జులై నెల 6 వరకు, చెన్నై-జైపూర్ ఎక్స్ప్రెస్ (12967) ఈ నెల 23, 25, 30, జులై 2,7 తేదీల్లో రద్దు చేసింది. జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్ (12968) ఈ నెల 21, 23, 28, 30, జులై 5న వరకు, మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ (12975) ఈ నెల 27, 29, జులై 4, 6 తేదీల్లో రద్దయ్యాయి. యశ్వంత్పూర్-లక్నో రైలు (12539) ఈ నెల 26, జులై 3న రద్దు చేశారు.
లక్నో-యశ్వంత్పూర్ రైలు (12540) ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు అయ్యింది. భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ (12577) ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. బిలాస్పూర్-త్రివేండ్రం తిరునల్వేలి ఎక్స్ప్రెస్ (22619) ఈ నెల 25, జులై 2 రద్దయ్యాయి. త్రివేండ్రం-బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ (22620) ఈ నెల 23, 30 తేదీల్లో.. పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణోదేవి (22352) ఈ నెల 21, 28, జులై 5వ తేదీల్లో.. శ్రీమాత వైష్ణోదేవి-పాటలీపుత్ర రైలు (22352) ఈ నెల 24, జులై 1, 8 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.