Telangana Thalli Funds : తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.5.80 కోట్లు మంజూరు చేసింది. కలెక్టరేట్‌లలో విగ్రహాల ఏర్పాటు త్వరలో ప్రారంభం కానుంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 19, 2026, 2:39 pm IST
Read Time: 2 mins
Telangana Thalli Funds : తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రూ.5.80 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో రాష్ట్రంలోని 33జిల్లాలలోని కలెక్టరేట్ లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

ఇవి కూడా చదవండి :

PM Modi : ఏఐ అవకాశం..ఆటంకం కాదు : ప్రధాని మోదీ
iPhone 17 Pro Max | ఫోన్ క‌వ‌ర్ కొంటే ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఉచితం.. అక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్‌..