సచివాలయంలోకి ఎంట్రీ రూట్‌ను మార్చుకున్న …. సీఎం రేవంత్‌రెడ్డి నార్త్ గేటు నుంచి లోనికి

సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సచివాలయంలోకి వచ్చే రూట్‌ను వాస్తు కోణంలో మార్పు చేసుకున్నారు. సింహద్వారం నుంచి కాకుండా నార్త్ గేటు నుంచి లోనికి వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నారు

  • Publish Date - June 11, 2024 / 04:29 PM IST

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సచివాలయంలోకి వచ్చే రూట్‌ను వాస్తు కోణంలో మార్పు చేసుకున్నారు. సింహద్వారం నుంచి కాకుండా నార్త్ గేటు నుంచి లోనికి వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నారు. మంగళవారం ఆయన నార్త్ గేటు నుంచి సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని వినియోగించారు.

 

వాస్తు మార్పుల్లో భాగంగా పశ్చిమం వైపు ఉన్న గేటు ద్వారా లోపలికి వస్తున్నారని, ఈశాన్యం వైపు ఉన్న గేటు ద్వా రా బయటికి వెళ్లిపోతున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి. అటు సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయం ఆరో అంతస్తులోనూ పలు వాస్తు మార్పులు జరుగుతున్నాయి. ఇంటీరియర్‌ డిజైన్‌తోపాటు ఫర్నిచర్‌లో కూడా మార్పులు చేర్పులు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సంఖ్యా శాస్త్రం, వాస్తు శాస్ర్తానికి అనుగుణంగా పలు మార్పులు చేపట్టారు. సీఎం కాన్వాయ్‌ని తెలుపు నుంచి నలుపు రంగులోకి మార్చుకోగా, కాన్వాయ్ సంఖ్యను తన అదృష్ట సంఖ్య 9కి పెంచుకున్నారు. కాన్వాయ్ వాహనాలపై 9వ నెంబర్ వచ్చేట్టుగా చూసుకున్నారు.

Latest News