మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో డొల్లతనం బట్టబయలవుతోంది. నాణ్యతా లోపమే బరాజ్ కుంగిపోయేందుకు కారణమైందని నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు లోపభూయిష్ట నిర్మాణాలను ఎత్తిచూపింది.
విధాత: మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో డొల్లతనం బట్టబయలవుతోంది. నాణ్యతా లోపమే బరాజ్ కుంగిపోయేందుకు కారణమైందని నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు లోపభూయిష్ట నిర్మాణాలను ఎత్తిచూపింది.
భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ (లక్ష్మీ బ్యారేజ్)కి జరిగిన నష్టాన్ని పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు శుక్రవారం పరిశీలించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన జర్నలిస్టుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం (సరస్వతి) బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ లను సందర్శించింది.
ఇటీవల బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయి డ్యాం పగుళ్లు పట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితిని పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్టుల బృందాన్ని డ్యాం పరిశీలనకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బృందం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీవ్రంగా దెబ్బతిన్న అవుట్ ఫ్లో ప్లాట్ ఫారం అన్నారం బ్యారేజీ అవుట్ ఫ్లో ప్లాట్ ఫారం తీవ్రంగా దెబ్బతిన్నదని నిజనిర్ధారణ కమిటీ పరిశీలనలో గుర్తించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని, భారీ నష్టం వాటిల్లిందని బృందం సభ్యలు అంచనా వేశారు. దీన్ని వెంటనే సరి చేయాల్సి ఉందన్నారు. ఎల్అండ్ఎన్టీ సంస్థ ప్రాజెక్టు నిర్మాణంలో పనితీరు లోపభూయిష్టంగా ఉందని స్పష్టమైంది.
నాసిరకం నిర్మాణం వల్లనే 7వ నెంబర్ పిల్లర్ వద్ద నిట్టనిలువుగా పగుళ్లు సంభవించాయని పేర్కొన్నారు.
8, 9 నెంబర్ పిల్లర్లు భూమిలోకి కుంగబడటం ఆ సంస్థ పనితీరుపై చెప్పకనే చెబుతోంది. సత్వరం చేయాల్సిన పనులను కూడా సదురు కంపెనీ చేయటం లేదని, ఈ విషయాలపై నిజ నిర్దారణ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కే కోటేశ్వర్ రావు, వెబ్ అండ్ యుట్యూబ్ చానెల్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పర్కాల సమ్మయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ దేశాయ్, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, జే ఉదయభాస్కర్ రెడ్డి, విశ్వేశ్వర రావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, రవికుమార్, తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మ రమేష.