సీబీఐ డైరెక్టర్ తో ముగిసిన ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశం

విధాత‌: కొకపేట భూముల్లో జరిగిన అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన రేవంత్.కొకపేట భూముల్లో జరిగిన అవినీతి పై ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా ను కలిసి విచారణ జరిపించాలని కోరుతాము.కొకపేట భూములను కేసీఆర్ బంధువులకు, కావాల్సిన వారికి తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టారు.2500 కోట్లకు భూములను అమ్మము అని చెప్తున్నారు..తెలంగాణ రాష్టానికి 1500 కోట్లు నష్టం వచ్చింది.కాంగ్రెస్ పార్టీ తరపున సీబీఐ డైరెక్టర్ ని కలవడం,రాత పూర్వకమైన నివేదిక ఇవ్వడం జరిగిందని రేవంత్ రెడ్డి […]

  • Publish Date - September 9, 2021 / 09:48 AM IST

విధాత‌: కొకపేట భూముల్లో జరిగిన అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన రేవంత్.కొకపేట భూముల్లో జరిగిన అవినీతి పై ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా ను కలిసి విచారణ జరిపించాలని కోరుతాము.కొకపేట భూములను కేసీఆర్ బంధువులకు, కావాల్సిన వారికి తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టారు.2500 కోట్లకు భూములను అమ్మము అని చెప్తున్నారు..తెలంగాణ రాష్టానికి 1500 కోట్లు నష్టం వచ్చింది.కాంగ్రెస్ పార్టీ తరపున సీబీఐ డైరెక్టర్ ని కలవడం,రాత పూర్వకమైన నివేదిక ఇవ్వడం జరిగిందని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

కేసీఆర్ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతి కి పాల్పడి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు.తెలంగాణ సంపదను కొల్లగొట్టి అవినీతి సొమ్ముతో రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తున్నారు.కేసీఆర్ కి కావాల్సిన గుప్పెడు మంది కొరకు తెలంగాణ సందపను దోచిపెడుతున్నాడు.కొకపేట,కనాపేట భూముల్లో టెండర్లో గోలుమాలు జరిగింది.దీనికి సహకరించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్,జయేష్ రంజన్, అరవింద్ కుమార్,సిద్ధిపేట కలెక్టర్ వెంకటారామిరెడ్డి పై సీబీఐ డైరెక్టర్ కి రాతపూర్వకమైన ఫిర్యాదు చేశాను.

మై హోమ్ సంస్థ,రాజ్ పుష్ప సంస్థ,మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి ప్రత్యక్ష లబ్ధిదారులు వారి పై కూడా పిర్యాదు చేశాను.బండి సంజేయ్,కిషన్ రెడ్డి పదే పదే కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది..తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు జైల్ కి పంపిస్తామని ప్రకటనలు చేస్తున్నారు.కనీసం కేసీఆర్ పై విచారణకు అదేశించడంలేదు.కేసీఆర్ అవినీతిపై విచారణకు అదేశించమని ప్రధాని,హోంమంత్రి,ఈడీ.. సీబీఐ డైరెక్టర్ల కానీ పిర్యాదు చేయడం లేదు.

బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మోడీ,అమిత్ నీతి,నిజాయితీ పరిపాలన అందించాలంటే రాష్టంలో జరిగిన అవినీతి పై విచారణకు అదేశించాలి.బండి సంజేయ్,కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న పాదయాత్ర లు చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మరు.కిషన్ రెడ్డి,బండి సంజేయ్ కేసీఆర్ తో కుమ్మక్కు కాకపోతే మేము చేసిన పిర్యాదు పై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అడగండి.కేసీఆర్ అవినీతి పై ప్రధానికి,హోమంత్రికి పిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ దొరకడం లేదా కేసీఆర్ తో బీజేపీ నేతలకు అవహగన లేకపోతే మేము ఇచ్చిన ఫిర్యాదు పై విచారణకు అదేశించాలి.

ఐఏఎస్ అధికారులు అవినీతి కి పాల్పడితే సీబీఐ విచారణ చేయొచ్చు.ఎమ్. ఎస్ టి సి పై సీబీఐ విచారణ చేయొచ్చు.బీజేపీ,టి.ఆర్ ఎస్ కుమ్మక్కు కాకపోతే బండి సంజేయ్,కిషన్ రెడ్డి నిజాయితీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.