Ponnam Prabhakar | పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హైదరాబాద్ కార్వన్ నియోజకవర్గంలోని కూల్సుంపుర లో జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మిక సందర్శించారు.

మెరుగైన విద్యకు ఉపాధ్యాయులు కృషి చేయాలి
విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హైదరాబాద్ కార్వన్ నియోజకవర్గంలోని కూల్సుంపుర లో జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మిక సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశఈలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. విద్యాబోధన తీరుపై 10 వ తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశాలపై ఆరా తీశారు. ప్రాథమిక తరగతులను పరిశీలించి విద్యార్థులతో కలిసి వారితో పాటే కింద కూర్చుని మాట్లాడారు. నూతనంగా నిర్మితమవుతున్న పాఠశాల భవనాన్ని పరిశీలించి, భవన నిర్మాణం పనులుఆలస్యం కావడానికి గల కారణాలపై ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. ఈసందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్రంలో 1100 కోట్లతో 25 వేల స్కూల్ లకు మౌలిక వసతులు కల్పించబోతున్నామన్నారు. ప్రతి పాఠశాలకుకి ఉచిత విద్యుత్తు అందివ్వడంతో పాటు శానిటేషన్ సిబ్బంది స్కావేంజర్స్ కోసం ప్రతి నెల ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నామని పేర్కోన్నారు. కల్సుంపుర స్కూల్ లో టాయిలెట్స్ సమస్య లేకుండా చూసుకుంటామని డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈసారి పదవ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని ఆదేశించారు. గత నెలలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు పూర్తయ్యాయని.. ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యార్థులకు ఎల్ఎస్ఆర్డబ్ల్యుపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులు బేసిక్ వర్డ్స్ కూడా సరిగా చెప్పకపోవడంతో ఉపాధ్యాయులు పిల్లలకు బేసిక్ ఇంగ్లీష్ పై పట్టు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.