విధాత : అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి తిరుమలలో కురుస్తున్న వర్షానికి తిరుమల తడిసి ముద్దయ్యాయి. అంతేగాక అలిపిరి వద్ద మెట్లపై నుంచి వరద ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తోంది. దీంతో టీటీడీ శుక్రవారం వరకు మెట్ల మార్గాన్ని మూసి వేశారు. భారీ ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి. అదేవిధంగా అలిపిరి నడక మార్గం గాలి గోపురం వద్ద భారీ […]
విధాత : అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి తిరుమలలో కురుస్తున్న వర్షానికి తిరుమల తడిసి ముద్దయ్యాయి. అంతేగాక అలిపిరి వద్ద మెట్లపై నుంచి వరద ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తోంది. దీంతో టీటీడీ శుక్రవారం వరకు మెట్ల మార్గాన్ని మూసి వేశారు.
భారీ ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి. అదేవిధంగా అలిపిరి నడక మార్గం గాలి గోపురం వద్ద భారీ వృక్షం నేలకొరిగి పక్కనే ఉన్న మూడు షాపులపై పడింది.
ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తిరుమల- పాపవినాశనం రోడ్డు మూసివేత
తిరుమల: తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. గాలుల ధాటికి పలు చోట్ల పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, చెట్టు కొమ్మలు రోడ్లపై పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల- పాప వినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు. అటవీ, తితిదే అధికారులు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు.
మరోవైపు వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.