ఆంధ్ర, ఛత్తీస్ఘడ్ ఏజెన్సీ ప్రాంతంలో “బూబీ ట్రాప్” లను అమర్చిన మావోయిస్టులు
విధాత: ఈరోజు నిరంతర తనిఖీలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ఆంధ్ర, ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మల్లం పేట గ్రామ అటవీ ప్రాంతంలో చింతూరు ASP G.కృష్ణ కాంత్ IPS నేతృత్వం లో చింతూరు మరియు ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ నక్సల్ స్క్వాడ్,సీఆర్పిఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్ లో భాగంగా కూంబింగ్ చేయు సందర్భంలో మావోయిస్టులు వ్యూహాత్మక దాడులలో ఒకటి గా భావించే 10 బూబి ట్రాప్ లను అమర్చారు. […]

విధాత: ఈరోజు నిరంతర తనిఖీలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ఆంధ్ర, ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మల్లం పేట గ్రామ అటవీ ప్రాంతంలో చింతూరు ASP G.కృష్ణ కాంత్ IPS నేతృత్వం లో చింతూరు మరియు ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ నక్సల్ స్క్వాడ్,సీఆర్పిఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్ లో భాగంగా కూంబింగ్ చేయు సందర్భంలో మావోయిస్టులు వ్యూహాత్మక దాడులలో ఒకటి గా భావించే 10 బూబి ట్రాప్ లను అమర్చారు. మావోయిస్టులు వ్యూహాత్మక యుద్ధ తంత్రంలో భాగంగా భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి వాటిలో చిక్కుకుని పోలీస్ బలగాలకు అపార నష్టం కలిగించే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బూబీ ట్రాప్ లను కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు గుర్తించి ధ్వంసం చేయడం జరిగినది.