విధాత : నీటి అడుగున తెలియాడుతు విన్యాసాలు చేసిన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. నీటి అడుగున అత్యంత క్లిష్టమైన, నీటిపై తేలే నియంత్రణ పాటిస్తూ, గాలి పీల్చకుండా ఊయల ఊగుతున్నట్లు చేసిన ‘హ్యూమన్ పెండ్యులం’ విన్యాసాన్ని జైదీప్ గోహిల్ ప్రదర్శించారు.
ఈ భారతీయ సూపర్ స్టార్ నీటిపై సంపూర్ణ నియంత్రణతో చేసిన ఈ అద్భుత ఫీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో నెట్టింటా దూసుకపోతుంది.
ప్రాచీన కాలం నుంచి యోగాలో భాగంగా జలస్తంభన విద్య, నీటిపై తెలియాడటం, నడవటం వంటి విన్యాసాలు అడపదడపా అక్కడక్కడా వెలుగు చూశాయి. అయితే కాలక్రమేణా వాటి సాధకులు, ప్రదర్శకులు అంతరించిపోతున్న తరుణంలో జైదీప్ గోహిల్ చేసిన ఈ విన్యాసం అందరిని విస్మయ పరుస్తుంది.
నీటి అడుగున అత్యంత క్లిష్టమైన, నీటిపై తేలే నియంత్రణ పాటిస్తూ, గాలి పీల్చకుండా ఊయల ఊగుతున్నట్లు చేసిన ‘హ్యూమన్ పెండ్యులం’ విన్యాసాన్ని జైదీప్ గోహిల్ ప్రదర్శించారు.#Jaideepgohil #humanpendulam #UANow pic.twitter.com/j8BvY0qRwA
— UttarandhraNow (@UttarandhraNow) January 24, 2026
ఇవి కూడా చదవండి :
Nampally Fire Accident : నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
Telangana Cabinet Expansion | మున్సిపోల్స్ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!
