EXPLAINED | కామన్ రెవెన్యూ కోడ్పై నిర్లక్ష్యం.. వంద చట్టాలతో సతమతం!
ధరణి పుణ్యమా అని రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారి పాస్ బుక్లు కూడా వచ్చాయి. ఇలాంటి అనుమానిత లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఫోరెన్సిక్ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించి అక్రమాలను వెలికితీసేందుకు విచారణ చేయిస్తామని చెప్పి రెండేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు విచారణకు ఆదేశించలేదు.
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
EXPLAINED | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కామన్ రెవెన్యూ కోడ్ అమలు చేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ ల్యాండ్ రెవెన్యూ కోడ్ను సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో భూ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలంగాణ కామన్ రెవెన్యూ కోడ్ ప్రవేశపెడితే బాగుంటుందని ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. రెవెన్యూ రిటైర్డ్ అధికారులు కూడా ఈ విధానం బాగుంటుందని అంటున్నారు. అయితే దీనిపై ఇంత వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల కోసం 196 చట్టాలు ఉండేవి.
- ఇలాంటి గజిబిజి చట్టాల మూలంగా అనేక సమస్యలు వస్తున్నాయని భావించారు.
- 1999 సంవత్సరం టీడీపీ పాలనలో 196 చట్టాలను ఏకీకృతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ సిద్ధం చేశారు.
- అప్పటి రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లును పంపించగా ఆమోదానికి నోచుకోలేదు.
- ఆ తరువాత వచ్చిన పాలకులు కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత భూముల విలువలు పెరిగిపోవడంతో వివాదాలు మరింతగా పెరిగాయి. రికార్డుల గందరగోళం, హద్దులలో అస్పష్టత, రకరకాలైన భూముల కారణంగా హత్యలకు దారి తీశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలుత భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించారు. అయినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆ తరువాత ధరణి వెబ్ పోర్టల్ తీసుకువచ్చినా సమస్యలు మరింత రెట్టింపు అయ్యాయి. దీనికోసం ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్ ను 2020 లో తీసుకువచ్చింది. 196 చట్టాలను వంద చట్టాలకు కుదించిన విషయం తెలిసిందే. ధరణి వెబ్ పోర్టల్ లో అనుభవంలో ఉన్న యజమానుల పేర్లు కాకుండా దశాబ్ధాల క్రితం నాటి భూముల యజమానుల పేర్లు చాలా ప్రాంతాల్లో నమోదు అయ్యాయి. కొనుగోలు చేసిన వారి పేర్లు అందులో లేకపోవడంతో పలువురు ఇప్పటికీ మండల తహశీల్దార్, సీసీఎల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయం లభించకపోవడంతో చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డు, దేవాదాయ, భూదాన్, వక్ఫ్ భూములకు రెక్కలొచ్చి పట్టా భూములుగా మారాయి. ధరణి పుణ్యమా అని రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారి పాస్ బుక్లు కూడా వచ్చాయి. ఇలాంటి అనుమానిత లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఫోరెన్సిక్ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించి అక్రమాలను వెలికితీసేందుకు విచారణ చేయిస్తామని చెప్పి రెండేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు విచారణకు ఆదేశించలేదు.
- అయితే సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థతో ప్రయోగాత్మకంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారు.
- తాజాగా ఆ సంస్థ రెవెన్యూ శాఖకు తన నివేదిక అందచేసింది.
- ధరణి వెబ్ పోర్టల్ ద్వారా ఏ సమయం, ఏ కంప్యూటర్, ఎక్కడి నుంచి లావాదేవీలు జరిగాయనేది తనిఖీ చేశారు.
- 22-ఏ నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వ భూములు తొలగింపు, బయోమెట్రిక్, డిజిటల్ సంతకాలు ఎవరు చేశారనే దానిపై ఆడిట్లో సవివరంగా తెలియచేశారు.
- ఈ నివేదికను అధ్యయనం చేసిన తరువాత ప్రభుత్వం మిగతా జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తుందా, వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సమస్యలన్నింటికి ముగింపు పలికేందుకు తెలంగాణ కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రిటైర్డు రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం భూములకు సంబంధించి 100 కు పైగా చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ చట్టాలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడం మూలంగా అయోమయానికి తెరపడుతుందంటున్నారు. ధరణి కమిటీ కూడా ఇదే అభిప్రాయంతో ఉందని గుర్తు చేస్తున్నారు
ఏపీలో రిజిస్ట్రేషన్ల రద్ధు అధికారం జిల్లా కలెక్టర్లకు
- ఆంధ్రప్రదేశ్లో భూ యజమానుల హక్కులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం జూలై నెలలో కీలక నిర్ణయం తీసుకున్నది.
- అక్రమంగా జరిగే భూమి రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా రిజిస్ట్రేషన్ చట్టం తీసుకువచ్చింది.
- ఇంతకు ముందు అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్లు జరిగితే పరిష్కరించే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేది. కొత్త చట్టం ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆ అధికారం కట్టబెట్టింది.
- జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను పరిశీలించిన తరువాత తప్పు జరిగిందని నిర్థారణ జరిగితే వెంటనే రద్ధు చేస్తూ నోటిఫికేషన్ ఇస్తుంది.
- ఇదే కాకుండా భూ సమస్యలను సరి చేసేందుకు ఆధార్ కార్డుతో సర్వే నెంబర్లను అనుసంధానం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
Read Also |
Prohibited Lands | నిషేధిత భూములపై తర్జన భర్జన.. సీసీఎల్ఏకు చేరుకున్న జాబితా!
NRI lands Encroached | ఎన్ఆర్ఐల భూములు భద్రమేనా? వారికి భరోసా ఇచ్చేదెవరు?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram