తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
విధాత: స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం రుణాలు పొందటంపై విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రూ.25వేల కోట్లు బ్యాంకు రుణాలు తీసుకుందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు బసవ ప్రభు పాటిల్, వై.బాలాజీ వాదించారు. ప్రజాధనాన్ని కన్సాలిడేట్ ఫండ్కు కాకుండా నేరుగా స్టేట్ కార్పొరేషన్లోకి మళ్లిస్తున్నారని వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ […]

విధాత: స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం రుణాలు పొందటంపై విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రూ.25వేల కోట్లు బ్యాంకు రుణాలు తీసుకుందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు బసవ ప్రభు పాటిల్, వై.బాలాజీ వాదించారు. ప్రజాధనాన్ని కన్సాలిడేట్ ఫండ్కు కాకుండా నేరుగా స్టేట్ కార్పొరేషన్లోకి మళ్లిస్తున్నారని వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కన్సాలిడేట్ ఫండ్ నుంచే నిధులు వెళ్తున్నాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈకేసులో మరిన్ని వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో తదుపరి విచారణనను న్యాయస్థానం వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.