ఆంద్రప్రదేశ్ శాసనమండలి రద్దు వెనక్కి: ఏపీ ప్రభుత్వం తీర్మానం
విధాత: ఆంద్రప్రదేశ్ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. గతేడాది శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్రం వద్దకు పంపగా 22 నెలలుగా కేంద్రం ఏ నిర్ణయం చెప్పకపోవడంతో మండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. దీంతో తాజా నిర్ణయంతో మండలిని కొనసాగించనున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం […]

విధాత: ఆంద్రప్రదేశ్ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. గతేడాది శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్రం వద్దకు పంపగా 22 నెలలుగా కేంద్రం ఏ నిర్ణయం చెప్పకపోవడంతో మండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. దీంతో తాజా నిర్ణయంతో మండలిని కొనసాగించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెం డింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది. మండలి రద్దును వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీర్మానం చేయడంతో మండలిని యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది