సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వండి: ఏపీ హైకోర్టు
అమరావతి: జగన్పై నమోదైన 11 కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవటంపై ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సుమోటో కేసుపై ఇవాళ విచారణ జరిగింది. పరిపాలన కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. నివేదికను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నమోదైన 11 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవటంపై ఇటీవల జ్యుడీషియల్ […]

అమరావతి: జగన్పై నమోదైన 11 కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవటంపై ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సుమోటో కేసుపై ఇవాళ విచారణ జరిగింది. పరిపాలన కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. నివేదికను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నమోదైన 11 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవటంపై ఇటీవల జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ విచారణ జరిపి ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే హైకోర్టు సుమోటోగా తీసుకుంది.