కృష్ణజలాలపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఏపీ
పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలి.నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలి.తక్షణమే తెలంగాణ జీవోను సస్పెండ్చేయాలి.కేఆర్ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి.పిటిషన్లో ఈ అంశాలను చేర్చినట్టుగా సమాచారం.రైతుల, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోంది.సముద్రంలోకి విలువైన జలాలను కలిసేలా పరిస్థితులు సృష్టించి మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది.తక్షణం అడ్డుకోవాలంటూ ఈ వాదనలను పిటిషన్లో ప్రస్తావించినట్టు సమాచారం. విధాత,అమరావతి:కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అక్రమాలపై సుప్రీంకోర్టుకు […]

పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.
అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలి.
నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలి.
తక్షణమే తెలంగాణ జీవోను సస్పెండ్చేయాలి.
కేఆర్ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి.
పిటిషన్లో ఈ అంశాలను చేర్చినట్టుగా సమాచారం.
రైతుల, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోంది.
సముద్రంలోకి విలువైన జలాలను కలిసేలా పరిస్థితులు సృష్టించి మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది.
తక్షణం అడ్డుకోవాలంటూ ఈ వాదనలను పిటిషన్లో ప్రస్తావించినట్టు సమాచారం.
విధాత,అమరావతి:కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అక్రమాలపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం.రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం.విచారణ సందర్భంగా ప్రస్తావించనున్న అంశాలపై సాగునీటి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం…
– దేశంలో రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు సర్వసాధారణమై పోయాయి.
– అంతర్రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లను జాతీయ ఆస్తులుగా గుర్తించి, నిర్వహణ, భద్రతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని ఈసందర్భంగా విజ్ఞప్తిచేసే అవకాశం.
– రిజర్వాయర్లతోపాటు వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలన్నింటినీకూడా జాతీయ ఆస్తులుగా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ కోరనుందనని సమాచారం.
– వివిధ నదుల్లో నీటివాటాలపై వివిధ ట్రైబ్యునల్స్, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి. వాటిని కచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమంటున్న అధికారులు.
– నిర్దేశించిన వాటాలను మీరి నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టులను విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వాత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా సాగునీటి అధాకార వర్గాల సమాచారం.
– నదీజలాల వివాదం ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారని, రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వీటిని పరిష్కరించాలని చెప్పారు కాబట్టి, అంతర్రాష్ట్ర నదీజలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్కేంద్రాలన్నీకూడా కేంద్రం పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్ద్వారా ఏపీ కోరనున్నట్టు తెలుస్తోంది.
– బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలే మొదటి ప్రాధాన్యత అని, విద్యుత్ ఉత్పత్తి అన్నది సాగునీటికోసం విడుదలచేసినప్పుడు మాత్రమే ఉత్పత్తిచేయాలి కాని, విద్యుత్ ఉత్పత్తికోసం నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్ ద్వారా ప్రస్తావించనున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి.
– నదికి దిగువన ఉన్న రాష్ట్రానికి లేదా ప్రాంతానికి ఉన్న తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం– పైప్రాంతంలో ఉన్న తాగునీటి, సాగునీటి అవసరాలమేరకు వాడుకనేక్రమంలో విద్యుత్పత్తి చేయాలి తప్ప, కింది ప్రాంతంలో ఉన్న అవసరాలతో నిమిత్తం లేకుండా, వాటిని పరిగణలోకి తీసుకోకుండా, పై ప్రాంతంలో కూడా సాగునీటి, తాగునీటి అవసరాలు లేకుండానే కేవలం విద్యుత్ఉత్పత్తికోసం నీళ్లని కిందకు విడిచిపెట్టి, తద్వారా సముద్రంలోకి విడిచిపెట్టే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్న వాదనను కూడా వినిపించనున్నట్టుగా తెలుస్తోంది.
– బచావత్ అవార్డు వెలువడిన నాటినుంచి కూడా ఈప్రోటోకాల్ను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పకుండా అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విధానానికి చట్టబద్ధత కూడా ఉందని తెలియజేస్తున్నారు.
– కాలక్రమేణాæ అనేక వివాదాలపై ట్రైబ్యునల్స్, కోర్టులు ఇచ్చిన తీర్పుల ద్వారా ఈ విధానానికి చట్టబద్ధత వచ్చిందని, మరింత దృఢంగా ఈ విధానం మారిందన్న విషయాన్ని వాదనల్లో పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తోంది.
– ఈ చట్టబద్ధ విధానానికి విరుద్ధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న ఒకరాష్ట్రం ఎప్పుడూ జరగనివిధంగా, ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనూహ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఎలాంటి చట్టాలు తమకు వర్తించవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదన్న విషయాన్ని ఆ వర్గాలు చెప్తున్నాయి.
– తమ హక్కుగా కేటాయించిన జలాలను తమకు దక్కనీయకుండా, విద్యుత్ఉత్పత్తి పేరిట దిగువకు విడిచిపెట్టం, అవి సముద్రంలో కలవడం, ఈ చర్యల వల్ల కొన్ని లక్షల మందికి రైతులకు, వారి కనీస అవసరాలను తీరుస్తున్న వ్యవసాయానికి విఘాతం కలుగుతోందని, దేశ ఆహార భద్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని పిటిషన్లో పొందుపరచనున్నారని భోగట్టా.
– నీరు, ఆహారం.. అనేవి దేశంలోని పౌరులందరి ప్రాథమిక హక్కులని, ఆ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయాన్ని పిటిషన్ద్వారా వివరించనున్నారని సాగునీటిశాక వర్గాలు ద్వారా తెలుస్తోంది.
– రిజర్వాయర్లను, వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే…. తరతమ భేదం లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుందనే వాదనను పొందుపరుస్తున్నట్టుగా సమాచారం.
– రెండురాష్ట్రాలకు చెందిన సాగునీటి సిబ్బంది, పోలీసులు పరస్పరం ఘర్షణలకు దిగే వాతావరణానికి దారితీసిన పరిస్థితులన్నీకూడా సృష్టించినవేనని, వీటిని తొలగించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా చెప్పనున్నాయని ఆ వర్గాల సమాచారం.
– పొరుగు రాష్ట్రం ఉల్లంఘనలపై ఇప్పటికే సంబంధిత ఆధీకృత సంస్థలకు ఫిర్యాదు చేశామని, వారుకూడా తమ పరిధిలో చట్టబద్ధంగా కొన్ని సూచనలు, ఉల్లంఘనలు నిలిపేయాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రం పాటించలేదన్న విషయాన్ని ప్రస్తావించనుందని సమాచారం.
– అంతే కాకుండా కేఆర్ఎంబీ విధివిధానాల ఖరారు ప్రక్రియ విషయంలో ఆదిలోనే తెలంగాణ రాష్ట్రం మోకాలొడ్డుతూ, అది ముందుకు సాగనీయకుండా చేయడం, అంతేకాకుండా విధివిధానాల ఖరారులాంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలను కేంద్రం గట్టిగా తీసుకోకపోవడం లాంటి అంశాలనుకూడా ఏపీ సుప్రీంకోర్టుకు నివేదించనుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
– లక్షలాదిమంది రైతులు, పౌరులు, వారి కనీస అవసరాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యతలో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్న విషయాన్ని నివేదించనున్నారని సాగునీటిశాఖ అధికారవర్గాలు చెప్తున్నాయి.
– తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా, కేఆర్ఎంబీ విధివిధానాలను ఖరారు చేయాలనికూడా ఈ పిటిషన్ద్వారా కోరనున్నారని సమాచారాం.
– రిజర్వాయర్లు, వాటిపై ఉన్న విద్యుత్త ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి ఇస్తూ ఆదేశాలు ఇవ్వాలని, గతంలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారం ఆ మేరకు నీళ్లు అందేలా చూడాలని ఈ పిటిషన్ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది.