లైమ్​ స్టోన్​ గనుల అక్రమ తవ్వకాల అభియోగంపై సీబీఐ కేసు

మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చిన దర్యాప్తు సంస్థ… పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. గతంలో స్థానిక పోలీసు స్టేషన్లలో దాఖలైన కేసుల వివరాలను సేకరించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో లైమ్ ​స్టోన్​ గనుల అక్రమ తవ్వకాలు జరిగాయన్న అభియోగంపై సీబీఐ కేసు నమోదైంది. పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలో నడికుడి, కేశనపల్లి గ్రామాల్లో లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసులో మొత్తం 17 […]

లైమ్​ స్టోన్​ గనుల అక్రమ తవ్వకాల అభియోగంపై సీబీఐ కేసు

మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చిన దర్యాప్తు సంస్థ… పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. గతంలో స్థానిక పోలీసు స్టేషన్లలో దాఖలైన కేసుల వివరాలను సేకరించింది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో లైమ్ ​స్టోన్​ గనుల అక్రమ తవ్వకాలు జరిగాయన్న అభియోగంపై సీబీఐ కేసు నమోదైంది. పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలో నడికుడి, కేశనపల్లి గ్రామాల్లో లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసులో మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చింది.

ఐపీసీ 379, 386, 420, 447 సెక్షన్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3లతో పాటు ఖనిజాలు, పేలుడు చట్టం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2010 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 9 మధ్య ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎఫ్​ఐఆర్​లో పొందుపరిచింది. గతంలోనూ ఈ వ్యవహారంలో పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసుస్టేషన్లలో నమోదైన మొత్తం కేసులను సీబీఐ తీసుకోనుంది .