తాడేపల్లి వైయస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్ పాయింట్స్.. శవాల మీద రాబందుల్లా టీడీపీ తయారైంది కరోనాపై ప్రభుత్వం, ఉద్యోగులు యుద్ధం చేస్తుంటే.. చంద్రబాబు చౌకబారు విమర్శలు ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతున్నారు కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రతిపక్ష టీడీపీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది కోవిడ్ సమయంలోనూ టీడీపీని బతికించుకోవలన్నదే చంద్రబాబు ఆరాటం ప్రతిపక్షంగా ఒక్కటైనా సహేతుకమైన సలహా, సూచన చేశారా చంద్రబాబూ..? విద్యార్ధుల భవిష్యత్తును […]
తాడేపల్లి వైయస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్ పాయింట్స్..
-: మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ
కరోనా విపత్కర సమయంలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బాధ్యతారాహిత్యంతో రాజకీయం చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజల్లో టీడీపీ బ్రతికి ఉందని చెప్పటానికి అవకాశం లేదు కాబట్టే.. తండ్రీకొడుకు కలిసి చెరొక అగ్గిపెట్టె పట్టుకొని ఎక్కడ నిప్పు పెడదామా అని రగిలిపోతున్నారు. అందులో భాగంగానే
తండ్రి ఆక్సిజన్ అందలేదంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంటే… కొడుకు విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి బొత్స ఘాటుగా విమర్శలు చేశారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం తమ పార్టీ ఉనికి కోసమే రాజకీయాలు చేస్తుంది తప్ప, వారికి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. చివరికి ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే…. ఆయన మాటల్లోనే..
పరీక్షలు రద్దు చేస్తే జాతీయ స్థాయిలో మన విద్యార్థులు ఎలా పోటీ పడగలరు?