ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయంఆ కుటుంబంలో ఒక మహిళకు కదిరి మున్సిపాలిటీ లో ఉద్యోగ అవకాశంముగ్గురు మహిళలకు విడో పింఛన్లు మంజూరుముగ్గురుకి వేర్వేరుగా ఇల్లు మంజూరు విధాత :ఇటీవల కదిరిలో కరోనాతో ఒకే ఇంట్లో కుటుంబ పెద్ద తో పాటు ఆయన ముగ్గురు కుమారులు ఇలా మొత్తం నలుగురు చనిపోయారు. దీంతో ఆ ఇల్లు మగ దిక్కును కోల్పోయింది.ఈ విషాద ఘటన కు సంబంధించి సాక్షి దినపత్రికలో ఇటీవల ప్రముఖంగా ప్రచురించిన విషయం అందరికీ […]
ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం
ఆ కుటుంబంలో ఒక మహిళకు కదిరి మున్సిపాలిటీ లో ఉద్యోగ అవకాశం
ముగ్గురు మహిళలకు విడో పింఛన్లు మంజూరు
ముగ్గురుకి వేర్వేరుగా ఇల్లు మంజూరు
విధాత :ఇటీవల కదిరిలో కరోనాతో ఒకే ఇంట్లో కుటుంబ పెద్ద తో పాటు ఆయన ముగ్గురు కుమారులు ఇలా మొత్తం నలుగురు చనిపోయారు. దీంతో ఆ ఇల్లు మగ దిక్కును కోల్పోయింది.ఈ విషాద ఘటన కు సంబంధించి సాక్షి దినపత్రికలో ఇటీవల ప్రముఖంగా ప్రచురించిన విషయం అందరికీ తెలిసిందే.ఇందుకు స్పందించిన కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.సీఎం స్పందిస్తూ ఆ కుటుంబానికి రూ 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.అలాగే ఆ కుటుంబంలో ఒక మహిళ కు మున్సిపాలిటీ లో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగ అవకాశం కల్పించారు. అదే విధంగా ముగ్గురికి రేషన్ కార్డులతో పాటు విడో పెన్షన్లను మంజూరు చేశారు.అలాగే ముగ్గురికి వేర్వేరుగా ఇల్లు కూడా మంజూరు చేశారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం కు సంబంధించిన చెక్కును ఈరోజు అనగా శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. మీకు అండగా నేను ఉంటాను.. అని అని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి సంతాపం, సానుభూతిని తెలియజేయమని చెప్పారని ఎమ్మెల్యే వారితో అన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన ఇద్దరు మహిళలకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఇందుకు ఆ కుటుంబం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కదిరి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు.