విశాఖ పోర్టులో మొట్టమొదటి 'ఎంఎస్ ది వరల్డ్' ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ లంగర్ వేసింది. దాదాపుగా 200 మంది ప్రయాణికులతో విశాఖకు చేరుకున్న క్రూయిజ్ షిప్ నగర పర్యాటక అభివృద్ధికి కొత్త ఆశలను మోసుకొచ్చింది
200మందితో ‘ఎంఎస్ దీ వరల్డ్’ లంగర్
విధాత, హైదరాబాద్ : విశాఖ పోర్టులో మొట్టమొదటి ‘ఎంఎస్ ది వరల్డ్’ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ లంగర్ వేసింది. దాదాపుగా 200 మంది ప్రయాణికులతో విశాఖకు చేరుకున్న క్రూయిజ్ షిప్ నగర పర్యాటక అభివృద్ధికి కొత్త ఆశలను మోసుకొచ్చింది. క్రూయిజ్ షిప్లోని ప్రయాణికులు నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ వున్నఅంతర్జాతీయ పర్యాటకులు ఈ క్రూయిజ్ ను ఎంగేజ్ చేసుకుంటారు. అమెరికాలో బయలు దేరిన ఈ ప్రయివేట్ క్రూయిజ్ రెండు రోజుల పాటు విశాఖలో ఉండనుంది. రెండేళ్ల క్రితం విశాఖకు క్రూయిజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్డోలియో ఎంప్రెస్ నౌక విశాఖ- పుదుచ్చేరి – చెన్నయ్ మధ్య షటిల్ చేసింది. ఈ ఏడాది షెడ్యుల్ ఖరారైన పోర్టు ఆధారిత సేవలు భారంగా మారడంతో నిలిపివేసినట్టు సమాచారం. ఇప్పటికే విశాఖలో క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించింది. రెండు వేల మంది ప్రయాణీకుల కేపాసిటీ కలిసిన ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సముద్ర పర్యాటకం నెమ్మదిగా ఊపు అందుకుంటోందని పర్యాటక శాఖ భారీ అంచనాలే పెట్టుకుంది.గతంలో దేశీయ పర్యాటకులతో కూడిన లగ్జరీ కార్డీలియా క్రూయిజ్ షిప్ చెన్నై-పుదుచ్చేరి-విశాఖల మధ్య నడిపించారు. ఇప్పుడు అంతర్జాతీయ పర్యాటకులతో కూడిన ప్రైవేటు క్రూయిజ్ షిప్ విశాఖ పర్యాటకానికి కొత్త హంగులు అద్దనుందంటున్నారు పర్యాటక రంగ నిపుణులు.