కృష్ణా బేసిన్లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ హైకోర్టులో రైతులు పిటిషన్
విధాత:కృష్ణా బేసిన్లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ ఏపీ కృష్ణా జిల్లా రైతులు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. జీవో 34 పై వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టగా… విచారణను సీజే ధర్మాసనం ఎదుట ఉంచాలని ఏజీ కోరారు. రైతుల పిటిషన్పై విచారణ జరపాలని సీజే తమను ఆదేశించారని జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం తెలిపింది. ఏజీ స్థాయి అధికారి నుంచి ఇలాంటి అసమంజస అభ్యర్థన సరికాదని […]

విధాత:కృష్ణా బేసిన్లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ ఏపీ కృష్ణా జిల్లా రైతులు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. జీవో 34 పై వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టగా… విచారణను సీజే ధర్మాసనం ఎదుట ఉంచాలని ఏజీ కోరారు. రైతుల పిటిషన్పై విచారణ జరపాలని సీజే తమను ఆదేశించారని జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం తెలిపింది. ఏజీ స్థాయి అధికారి నుంచి ఇలాంటి అసమంజస అభ్యర్థన సరికాదని పేర్కొంది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట విచారించాలనడం… తమ ధర్మాసనంపై దాడేనని వ్యాఖ్యానించింది. అనంతరం రైతుల పిటిషన్పై విచారణ ప్రారంభించిన జస్టిస్ రామచంద్రరావు బెంచ్… అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అని ధర్మాసనం ప్రశ్నించింది.రాజోలిబండపై సుప్రీం తీర్పును అధ్యయనం చేయాలని… పిటిషనర్ను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. రేపు వాదనలు వినిపించాలని చెబుతూ విచారణను రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తి… ఇంధనశాఖ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని కృష్ణా జిల్లా రైతులు పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడొద్దని అభ్యంతరం తెలిపారు.