చిత్తూరు నగరంలో వస్త్రాలు చోరీ చేస్తూ దొరికిన ఓ పోలీసు అధికారి మృతి
ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో మనస్తాపానికి గురై మరణించినట్లు తెలిపిన పోలీసులు విధాత: చిత్తూరు నగరంలో ఓ వ్యాపారి వ్యానులో పెట్టిన దుస్తులను చోరీ చేస్తూ ఇటీవల దొరికిపోయిన.. ఏఆర్ ఎస్సై మహమ్మద్ మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక కానిస్టేబుల్తో కలిసి దుస్తులు దొంగతనం చేసిన ఘటనలో.. సీసీ పుటేజీ ఆధారంగా మహమ్మద్ను పోలీసు శాఖ ఉన్నతాధికారులు విధులు నుంచి తాత్కాలికంగా తొలగించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి […]

- ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో మనస్తాపానికి గురై మరణించినట్లు తెలిపిన పోలీసులు
విధాత: చిత్తూరు నగరంలో ఓ వ్యాపారి వ్యానులో పెట్టిన దుస్తులను చోరీ చేస్తూ ఇటీవల దొరికిపోయిన.. ఏఆర్ ఎస్సై మహమ్మద్ మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక కానిస్టేబుల్తో కలిసి దుస్తులు దొంగతనం చేసిన ఘటనలో.. సీసీ పుటేజీ ఆధారంగా మహమ్మద్ను పోలీసు శాఖ ఉన్నతాధికారులు విధులు నుంచి తాత్కాలికంగా తొలగించారు.
అనంతరం ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సస్పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం ఆయనకు అందడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం ఉదయం మహమ్మద్ వాంతులు చేసుకోగా..జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సదరు అధికారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.