గర్ల్ ఫ్రెండ్ ను సెక్షన్ 498 ఏ కింద విచారించడానికి వీల్లేదు
విధాత:గర్ల్ ఫ్రెండ్ ను ఐపీసీ సెక్షన్ 498 ఏ ( మహిళను వేధింపులకు గురిచేయడం ) కింద విచారించడానికి వీల్లేదని అని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తేల్చి చెప్పింది . ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ అతని గర్ల్ ఫ్రెండ్ పై పోలీసులు 498 ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్ తో పాటు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు . ఈ […]

విధాత:గర్ల్ ఫ్రెండ్ ను ఐపీసీ సెక్షన్ 498 ఏ ( మహిళను వేధింపులకు గురిచేయడం ) కింద విచారించడానికి వీల్లేదని అని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తేల్చి చెప్పింది . ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ అతని గర్ల్ ఫ్రెండ్ పై పోలీసులు 498 ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్ తో పాటు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు . ఈ సెక్షన్ కింద భర్త రక్త సంబంధీకులు , వివాహం ద్వారా బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది .
భర్త బంధువుల్లో గర్ల్ ఫ్రెండ్ రాదని , అందువల్ల ఆమెను 498 ఏ కింద విచారించడానికి వీల్లేదని తెలిపింది . వివరాలు .. నెల్లూరు జిల్లా దిశ పోలీసు స్టేషన్లో ఓ వివాహత .. తన భర్తతో సాన్నిహిత్యం కలిగి ఉన్న మహిళపై ఫిర్యాదు చేసింది . ఆమె తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందంటూ పేర్కొంది .
ఫిర్యాదు చేసిన వివాహిత … భర్తను మొదటి నిందితుడిగా , అతనితో సంబంధం పెట్టుకున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు . దీంతో దిశ పోలీసులు .. ఐపీసీ సెక్షన్ 498 ఏ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు . అయితే తనపై సెక్షన్ 498 ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ నిందితురాలు హైకోర్టును ఆశ్రయించింది . హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహిళ .. తనపై నమోదైన ఎస్ఎఆర్ను రద్దు చేయాలని కోరింది . పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ … ఫిర్యాదు చేసిన వివాహిత భర్తకు పిటిషనర్ బంధువు కాదన్నారు . ఈ నేపథ్యంలో పిటిషనర్ పోలీసులు సెక్షన్ 498 ఏ కింద నమోదు చేసిన కేసు చెల్లదన్నారు . ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని అన్నారు .
వీటిని పరిగణలోకి తీసుకన్న న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ .. పిటిషనర్పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు . 498 ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు . ఈ కేసుకు సంబంధించి మొదటి నిందితుడిపై దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపారు .