పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు సమావేశం

విధాత‌: రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. సోలార్, విండ్ పవర్ తీసుకువచ్చాం. జగన్ రెడ్డి అంతా నాశనం చేశారు. బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్ప‌డింది,డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 […]

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు సమావేశం

విధాత‌: రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. సోలార్, విండ్ పవర్ తీసుకువచ్చాం. జగన్ రెడ్డి అంతా నాశనం చేశారు. బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్ప‌డింది,డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదు కానీ కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారు.తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన టీడీపీ నేతలు.హౌస్ సైట్స్ విషయంలో వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారు. గృహ నిర్మాణ పునాదిపైన కేంద్రం రూ.3,700 కోట్లు విడుదల చేసింది. దీనిలో రూ.2 వేల కోట్లను దారి మళ్లించారు. దారిమళ్లించిన నిధులు లబ్ధిదారులకు ఎగనామం పెట్టేందుకు వైసీపీనే కోర్టులో కేసులు వేయించి దాన్ని ప్రతిపక్షాలకు అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారు.

జగన్ రెడ్డి కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారు.సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల అవినీతి చేశారు.రెండు సెంట్లు నగరాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలి. రాష్ట్ర నిధుల నుంచి మరో రూ.2 లక్షలు గృహనిర్మాణానికి విడుదల చేయాలి.ఆసరా పేరుతో జగన్ రెడ్డి మహిళలకు టోకరా పెట్టారు. తెలుగుదేశం 98 లక్షల మందికి సమానంగా లబ్ధి చేకూర్చగా జగన్ రెడ్డి ప్రభుత్వం 78 లక్షల మందికి కుదించారు. 20 లక్షల మందికి ఎగనామం పెట్టారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తక్కువ ఇచ్చారని పేర్కొన్నారు.

డ్వాక్రా మహిళలకు రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలి,ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గంగిరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. ఆషి ట్రేడింగ్ కంపెనీతో వేలకోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాకు శ్రీకారం చుట్టారు. ఆశి అనే పేరు ఆలీషా కుమార్తె యొక్క నిక్ నేమ్ కాదా?.ఆలీషా పెద్ద మనిషి అని చంద్రశేఖర్ రెడ్డి కితాబు ఎందుకు ఇచ్చారు? వారి అక్రమ వ్యాపారానికి ఇది నిదర్శనం కాదా?.హవాలా, మనీలాండరింగ్ ద్వారా పెద్దఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు.గంజాయి, హెరాయన్, ఎర్రచందనం, తలనీలాలకు, స్మగ్లర్లకు పెద్దపీట వేయడమే జగన్ రెడ్డి విధానంగా ఉందని ప్ర‌శ్నించారు.

దేశంలో ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్స్ ఏపీలోనే ఎందుకు ఉన్నాయి? నీరు-చెట్టు, ఎస్డీఎఫ్ పనులు, సర్వశిక్షా అభియాన్, అంగన్ వాడీ, గోకులం, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనుల బిల్లుల విషయంలోనూ పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్స్ ను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యారు,ఇప్పటికే రూ.6 లక్షల కోట్లు అప్పులు చేశారు. పెద్దఎత్తున అప్పులు చేస్తూ.. ఆ డబ్బుతో అవినీతి, దుబారాకు పాల్పడుతున్నారు.వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ రెడ్డి వారికి తీరని ద్రోహం చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామనే హామీ ఏమైంది? జీతాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి. పెన్షన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.పీఆర్సీ, డీఏలు చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అమూల్ కు పాలుపోయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు.రాష్ట్ర సహకార డైయిరీలను కాదని గుజరాత్ కు చెందిన అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు.ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య మళ్లీ చిచ్చుపెట్టేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు,వైసీపీ నేతల అవినీతిని, ప్రజా సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికి వైసీపీ కుల, మత, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే హీనస్థితికి దిగజార్చారని పేర్కొన్నారు.