• ప్రతీ గ్రామంలో ఆర్బీకేల ద్వారా ధాన్యం నమూనాలు పరిశీలించి రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు • ధాన్యం అమ్మిన రైతుకు రసీదులో పొందుపరిచిన మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాకు జమ • రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర, సకాలంలో చెల్లింపులు • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను” ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్న తెలంగాణ, తదితర రాష్ట్రాలు విధాత:విజయవాడ, 19 […]
• ప్రతీ గ్రామంలో ఆర్బీకేల ద్వారా ధాన్యం నమూనాలు పరిశీలించి రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
• ధాన్యం అమ్మిన రైతుకు రసీదులో పొందుపరిచిన మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాకు జమ
• రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర, సకాలంలో చెల్లింపులు
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను” ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్న తెలంగాణ, తదితర రాష్ట్రాలు
విధాత:విజయవాడ, 19 మే:దృష్ట్యా ఏర్పడిన పరిస్థితుల వల్ల ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు తేదీలను ప్రకటించి, ప్రతి రైతుకు కూపన్లు జారీ చేసి ధాన్యాన్ని సేకరించటం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 1,66,814 కూపన్లు జారీ చేయడం జరిగిందని, కూపన్ లో నిర్ణయించిన తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది రైతు కల్లం వద్దకు వెళ్లి ధాన్యాన్ని కాటా వేసి నిర్ణయించబడిన మిల్లుకు ధాన్యం తరలిస్తారని పేర్కొన్నారు. అనంతరం కాటా వేసిన ధాన్యం పరిమాణంకి తగిన కొనుగోలు రశీదును అందజేస్తారని, ధాన్యం అమ్మిన రైతుకు రసీదులో పొందుపరిచిన మొత్తాన్ని ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాకు జమచేయటం జరుగుతుందని వివరించారు.
కరోనా నేపథ్యంలో రైతులకు ఉండే సమస్యల పరిష్కారం కొరకు జిల్లా మరియు క్షేత్ర స్థాయిలో 20 కొనుగోలు కేంద్రాలకు ఒక పర్యవేక్షణాధికారిని సంబంధిత శాఖల నుంచి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రైతు భరోసా కేంద్రంలో తేమ శాతం పరీక్షించడానికి మాయిశ్చర్ మీటర్ లు(Moisture Meters) ఏర్పాటు చేశామన్నారు.
2020-21 సంవత్సరం పంటకాలానికి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. ఇప్పటివరకు 1,15,813 రైతుల వద్ద నుండి రూ.2,510 కోట్ల విలువ చేసే 13.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మే 31వ తేదీలోగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ... కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనాతో కొనుగోలుకు ఏర్పాటు చేశామని వివరించారు. ఇందుకుగాను వరి పంటకు సంబంధించి 7,706 రైతు భరోసా కేంద్రాలను 3,936 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేయడం జరిగిందని, గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా 3,01,540 రైతుల వివరాలను ధాన్యం కొనుగోలు కోసం నమోదు చేయడం జరిగిందన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం నమూనా పరిశీలించి రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగులు ఏర్పాట్లు చేయడమైందన్నారు. రైతుకు సంబంధించిన భూమి మరియు పంట సాగు వివరాలను ఆన్ లైన్ ఈ క్రాప్(e-పంట) సర్వీస్ ద్వారా నమోదు చేయించి, ధాన్యం కొనుగోలు సమయంలో వివరాలు సరిపోల్చి, ధాన్యం కొనుగోలు చేయటం ద్వారా దళారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేయడం గర్వకారణమన్నారు. ప్రస్తుతం రైతు వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్ద మర పట్టించి సోర్టెక్స్ చేయించగా వచ్చిన నాణ్యమైన బియ్యమును మాత్రమే సేకరించి ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా నిరుపేదలైన లబ్ధిదారులు అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.
రబీ ధాన్యం కొనుగోలు మరియు చెల్లింపుల వివరములు:
క్రమ సంఖ్య సంవత్సరం ధాన్యం కొనుగోలు (MTs) చెల్లింపులు (Crores)
1 2017-18 18,12,956 2,853.64
2 2018-19 27,52,702 4,838.03
3 2019-20 34,73,414 6,331.41
4 2020-21 13,40,010 2,510.00