Gold Rates | స్వల్పంగా పెరిగిన బంగారం.. హైదరాబాద్లో నేడు ధరలు ఇలా..!
Gold Rates | పసిడి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.10 పెరిగి రూ.61,360 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 తులానికి రూ.66,940కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.62,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,810కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.61,360 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,940కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.61,510 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,090కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.61,360 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,940 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి స్వల్పంగా దిగివచ్చింది. రూ.100 తగ్గి కిలో వెండి రూ.77,100 ధర పలుకుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రూ.80,100కి చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.