భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ ఓ సంచలనం. ప్రస్తుతం ఆయన ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు.మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులని అవలీలగా చెరిపేస్తున్నారు. కోహ్లీ చాలా ఏళ్ల తర్వాత తిరిగి టీ 20లలోకి రాగా, ఆయన ధనాధన్ బ్యాటింగ్ చూసి అందరు ఫుల్ ఖుష్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు టీ 20లలో మొదటి టీ20కి గైర్హాజరైన కోహ్లీ రెండో టీ20లో పర్వాలేదనిపించాడు. ఇక మూడో టీ20లో డకౌట్ అయ్యాడు. కాని ఫీల్డింగ్లో మాత్రం ఇరగదీసాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 17వ ఓవర్ 4వ బంతికి కరీం జనత్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ కొట్టగా, బంతి బౌండరీ లైన్ దాటబోతుండగా.. విరాట్ కోహ్లీ సూపర్మ్యాన్లా దూకి బంతిని ఆపగలిగాడు.
విరాట్ కోహ్లి సిక్స్ను ఆపడం ద్వారా 5 పరుగులు ఆదా చేశాడు. దీంతో అఫ్గానిస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ల దాకా వెళ్లింది. లేదంటే ఓడిపోయే పరిస్థితి ఉండేది. ఇక కోహ్లీ ఫీల్డ్లో ఉన్నప్పుడు తన ఆటతో పాటు సెలబ్రేషన్స్తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఒక్కోసారి వెరైటీ డ్యాన్స్లు చేస్తూ ఉంటారు. ఇంకోసారి విచిత్ర హావభావాలు ప్రదర్శిస్తూ రచ్చ చేస్తుంటాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ20లో విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ వైరల్గా మారాయి.
మూడు టీ20ల సిరీస్ క్లీన్స్వీప్ చేసిన ఇండియన్ టీమ్.. ట్రోఫీ సొంతం చేసుకోగా, ట్రోఫీ గెలిచిన తర్వాత గ్రూప్ ఫొటో సమయంలో కోహ్లి మైఖేల్ జాక్సన్ స్లైడ్ తో సహచరుల దగ్గరికి దూసుకొచ్చాడు. ఇక మోయే మోయే అనే సాంగ్కి కూడా విచిత్రంగా డ్యాన్స్ చేసి అందరిని నవ్వించాడు.. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మూడో టీ 20 మ్యాచ్లో కోహ్లీ ఫీల్డ్లో చాలా చురకుగా కనిపించాడు. సిక్సర్ ఆపడమే కాకుండా, అద్భుతమైన క్యాచ్ పట్టడం, ఓ రనౌట్ చేయడం కూడా మనం చూశాం. ఏదేమైన కోహ్లీ ఎనర్జీ మాత్రం వేరే లెవల్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.