‘మా’ ఎన్నికలలో మరో కొత్త మలుపు

విధాత:‘మా’ ఎన్నికల వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని.. అందువల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ‘‘మేమందరం 2019, మార్చిలో ఎన్నికయ్యాము. మా పదవీ కాలం 2021, మార్చితో ముగిసిపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి ‘మా’ ఒక […]

‘మా’ ఎన్నికలలో  మరో కొత్త మలుపు

విధాత:‘మా’ ఎన్నికల వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని.. అందువల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ‘‘మేమందరం 2019, మార్చిలో ఎన్నికయ్యాము. మా పదవీ కాలం 2021, మార్చితో ముగిసిపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి ‘మా’ ఒక ఎన్నికైన కార్యవర్గం లేకుండానే ఉంది. తాము ఎన్నికయిన కార్యవర్గమని చెప్పుకోవటానికి ప్రస్తుత కమిటీకి ఎటువంటి నైతిక హక్కు లేదు.. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడిగా.. ‘మా’లో సీనియర్‌ సభ్యుడిగా – మీరు పగ్గాలు చేపట్టండి. తక్షణమే ఎన్నికలు నిర్వహించండి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలను సక్రమంగా, సజావుగా నిర్వహించటంలో తమ పూర్తి సహకారం ఉంటుందని కూడా వెల్లడించారు.

మెజారిటీ సభ్యులు..

‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ప్రస్తుతం 24 మంది సభ్యులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం గురువారం సా యంత్రం జరగనుంది. సాధారణంగా ఈ కమిటీ సమా వేశానికి అధ్యక్షుడు నరేష్‌ అధ్యక్షత వహించాల్సి ఉంది. అయితే నరేష్‌ బదులుగా క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షత వహించనున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ స మావేశంలో ఎన్నికలు సహా కొన్ని ముఖ్యమైన అంశాలపై చ ర్చ జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఈసీ స భ్యులు లేఖ రాయటం ప్రా ధాన్యత సంతరించుకుంది. ఈ లే ఖలపై అభిప్రాయం తెలపమని మా అధ్యక్షుడిని. క్రమశిక్షణా సంఘం సభ్యులను కృష్ణంరాజు కోరే అవకాశముంది. వారి అ భిప్రాయం మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని వి శ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.