ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని కొన్నేళ్లుగా ప్రేమించుకొని 2022లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మే నెలలో వీరి వివాహం తెలుగు, తమిళ్ సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వీరిద్దరు ప్రగ్నెంట్ అంటూ ప్రచారాలు సాగాయి. అయితే దీనిపై నిక్కీ గల్రాని ఘాటుగా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ వార్తలపై స్పందిస్తూ.. ”ఈ విషయం నాకే తెలీదు. కొంతమంది నేను ప్రెగ్నెంట్ అనే వార్తని వైరల్ చేసారు. వాళ్ళే కొంచెం నా డెలివరీ డేట్ కూడా చెబితే బాగుంటుంది. నేను ప్రెగ్నెంట్ ని కాదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఆ వార్త ముందుగా నేనే చెప్తాను. ఇలాంటి ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేయోద్దు అంటూ కోరింది నిక్కీ గల్రాని. ఇక తాజాగా ఆమె ప్రగ్నెన్సీ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని ఇద్దరు కలిసి దిగిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో నిక్కీ పొట్ట కాస్త ఉబ్తెత్తుగా కనిపిస్తుంది. ఈ పిక్స్ చూసి నిక్కీ ప్రెగ్నెంట్ అంటూ కొందరు కన్ఫాం చేస్తున్నారు. వారిద్దరు ఇలా ఫొటో షూట్ చేయడం వెనక కారణం కూడా ఇదే అని కొందరు అంటున్నారు. తన ఫొటోస్ ఇలా షేర్ చేసి నిక్కీ గల్రాని తన ప్రెగ్నెన్సీపై హింట్ ఇచ్చిందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైన ఇప్పుడు నిక్కీ గల్రాని ప్రెగ్నెన్సీ న్యూస్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి నిక్కీ గల్రాని- ఆది విడాకులు తప్పక తీసుకుంటారని చెప్పుకు వచ్చాడు.
నాగచైతన్య, సమంతలానే ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని జంట కూడా విడిపోతారని ఆయన జ్యోతిష్యం చెప్పారు. వారిద్దరు విడిపోయేందుకు 80 శాతం అవకాశం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతానికి వారిద్దరు కలిసి సంతోషంగానే ఉన్నారు. మరి వేణు స్వామి చెప్పినట్టు నిజంగానే వారు విడిపోతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక నిక్కీ గల్రాని, ఆది కలిసి పలు సినిమాలలో నటించగా ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ పెద్దల సమక్షంలో పెళ్లిగా మారింది. మరి ఇప్పుడు నిక్కీ గల్రాని ప్రగ్నెన్సీపై వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందో చూడాలి.