వైద్యం విక‌టించి 8 మంది మృతి

విధాత‌: (రాయ్‌పూర్): ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్‌పూర్‌లో విషాదం నెల‌కొంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనారోగ్యం కార‌ణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది స్థానిక డాక్ట‌ర్ వ‌ద్ద వైద్యం కోసం వెళ్లారు. ఆ డాక్ట‌ర్ హోమియోప‌తి మెడిసిన్ డ్రోసెరా 30లో నాటుసారా క‌లిపి ఆ కుటుంబ స‌భ్యుల‌కు ఇంజెక్ష‌న్ రూపంలో ఇచ్చాడు. దీంతో 8 మంది […]

  • Publish Date - May 6, 2021 / 11:11 AM IST

విధాత‌: (రాయ్‌పూర్): ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్‌పూర్‌లో విషాదం నెల‌కొంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అనారోగ్యం కార‌ణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది స్థానిక డాక్ట‌ర్ వ‌ద్ద వైద్యం కోసం వెళ్లారు. ఆ డాక్ట‌ర్ హోమియోప‌తి మెడిసిన్ డ్రోసెరా 30లో నాటుసారా క‌లిపి ఆ కుటుంబ స‌భ్యుల‌కు ఇంజెక్ష‌న్ రూపంలో ఇచ్చాడు. దీంతో 8 మంది ఒకేసారి చనిపోగా, మిగ‌తా ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వైద్యం చేసిన డాక్ట‌ర్ ప‌రారీలో ఉన్నాడు. అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest News