ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి

విధాత‌(జగిత్యాల) : ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సదరు యువకుడు తనను గాయపరుచుకున్నాడు. ఈ ఘటనల జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే వారిని దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. మేడిపల్లికి చెందిన మన్నెగూడెంకు చెందిన రాజ్‌కుమార్‌ అనే యువకుడు తనను ప్రేమించాలని గత కొంతకాలంగా జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌కు చెందిన ఓ యువతి వెంటపడుతున్నాడు. సదరు యువతి మన్నెగూడెంలోని అమ్మమ్మ […]

  • Publish Date - May 8, 2021 / 09:14 AM IST

విధాత‌(జగిత్యాల) : ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సదరు యువకుడు తనను గాయపరుచుకున్నాడు. ఈ ఘటనల జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే వారిని దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. మేడిపల్లికి చెందిన మన్నెగూడెంకు చెందిన రాజ్‌కుమార్‌ అనే యువకుడు తనను ప్రేమించాలని గత కొంతకాలంగా జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌కు చెందిన ఓ యువతి వెంటపడుతున్నాడు.

సదరు యువతి మన్నెగూడెంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదవుకుంది. అప్పటి నుంచి తనను ప్రేమించాలని యువతి వెంట పడుతూ వస్తుండగా.. తిరస్కరించింది. ఈ క్రమంలో కోపం పెంచుకున్న రాజ్‌కుమార్‌ శనివారం జాబితాపూర్‌కు చేరుకొని కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన గొంతు కోసుకున్నాడు.. ఇద్దరికి గాయాలవగా.. గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News