విధాత(ప.గో.జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 6వ వార్డు సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న ముప్పిడి సోనీ(31) సేవలు ఎప్పటికీ మరువలేమని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. సోనీ 7 నెలల గర్భిణి. కరోనా విపత్కర పరిస్థితుల్లో గర్భిణులు, పిల్లలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయినా సోనీ విధి నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగింది. కరోనా బాధితులకు తన వంతు సేవలందించింది. చివరకు కరోనా బారిన పడి విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సోనీ […]
విధాత(ప.గో.జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 6వ వార్డు సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న ముప్పిడి సోనీ(31) సేవలు ఎప్పటికీ మరువలేమని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. సోనీ 7 నెలల గర్భిణి. కరోనా విపత్కర పరిస్థితుల్లో గర్భిణులు, పిల్లలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయినా సోనీ విధి నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగింది. కరోనా బాధితులకు తన వంతు సేవలందించింది. చివరకు కరోనా బారిన పడి విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సోనీ మృతితో ఆమె కడుపులోని శిశువు తో మృతి చెందింది. ఈ ఘటన అందరినీ కలచివేసింది.