విధాత: కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారిన పడి శుక్రవారం మరో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. గత పది రోజుల నుంచి ఇప్పటి వరకు 14 మంది ఉద్యోగులు మృతిచెందారు.
ఆర్టీపీపీలో అనధికారికంగా 200 మంది కరోనా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తీవ్రతరం కావడంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. మృతుల్లో ఇంజినీర్లు, అకౌంట్ సెక్షన్, జూనియర్ ప్లాట్ అసిస్టెంట్లు ఉన్నారు.