THB Auction | ఈ నెల 6 నుంచి హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలు — చింతల్‌లో బహిరంగ వేలం, కెపిహెచ్‌బి–రావిర్యాలలో ఈ-వేలం

తెలంగాణ హౌసింగ్ బోర్డు (THB) ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ సహా పలు పట్టణ ప్రాంతాల్లోని భూములు, ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగ మరియు ఈ-వేలం పద్ధతుల్లో విక్రయించడానికి సిద్ధమైంది. ఈ సారి వేలంపాటలు చింతల్‌, నిజాంపేట‌, బాచుపల్లి‌, కెపిహెచ్‌బి‌, నాంపల్లి‌, రావిర్యాల ప్రాంతాల్లో జరగనున్నాయి.

ఈ నెల 6 నుంచి హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలు — చింతల్‌లో బహిరంగ వేలం, కెపిహెచ్‌బి–రావిర్యాలలో ఈ-వేలం

Telangana Housing Board to Begin Land Sales from October 6 — Open and e-Auctions in Chintal, KPHB, and Raviryala

హైదరాబాద్ , అక్టోబర్ 4( విధాత‌):

THB Auction | గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధితో సహా పలు పట్టణ ప్రాంతాల్లో  ఉన్న భూములను, ఖాళీ ప్లాట్ల‌ను అక్టోబరు 6 వ తేదీ సోమవారం నుంచి వివిధ ర‌కాల‌ వేలం పాట‌ల ద్వారా విక్ర‌యించ‌డానికి  తెలంగాణ హౌసింగ్ బోర్డు సిద్దమైంది. సోమవారం  నగరంలోని చింతల్, నిజాంపేట, బాచుపల్లి  ప్రాంతంలో ఉన్న 22 రెసిడెన్షియల్ ప్లాట్లు, ఫ్లాట్ (plots , flats) లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను గత నెల 15 తేదీన జారీ చేశారు. చింతల్ ప్రాంతంలో 18 ఎంఐజి, హెచ్ ఐజి ప్లాట్లు (plots), నిజాం పేట బాచుపల్లిలో 4 ఫ్లాట్లు (Flats) ను బహిరంగ వేలం వేయనున్నారు.

ప్లాట్ల ప్రాంతాలు – ఇతర వివరాలు

ఇటీవల కెపిహెచ్ బి కాలనీ ప్రాంతంలో హౌసింగ్ బోర్డు పలు దఫాలుగా నిర్వహించిన భూముల విక్రయాల్లో ఎకరా భూమి సుమారు రూ. 70 కోట్లకు ఈ-వేలం ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  కెపిహెచ్ బి కాలనీలో నాలుగు కమర్షియల్ ప్లాట్లను అక్టోబర్ 7, 8  వ తేదీల్లో  ఈ-వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు. ఫేజ్ 1 మరియు 2 పరిధిలో ఉన్న  6549 చదరపు గజాలతో పాటు, 2420 చ.గజాలు, 2397 చ. గజాలు, 726చ. గజాల విస్తీర్ణంలోని ప్లాట్ లకు మంగళవారం నాడు ఈ-వేలం నిర్వహిస్తున్నారు. అలాగే నాంపల్లి ప్రాంతంలోని 1148 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ ను  8 వ తేదీన ఈ-వేలం ద్వారానే విక్రయిస్తున్నామ‌ని హౌసింగ్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.   అక్టోబరు 9, 10 వ తేదీల్లో చింతల్ లోని 10,890 చదరపు గజాల కమర్షియల్ భూమి, మహేశ్వరం మండలంలోని రావిర్యాల ప్రాంతంలోని 13,503 చ.గ.లు, 5,953.20 చ.గ.లు, 3,630 చ.గజాల విస్తీర్ణంలోని భూములను కూడా ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.

రాగ‌ల‌ పది రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో సంగారెడ్డి – సదాశివపేట లోని ప్లాట్లు, జోగులాంబ గద్వాల, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన భూములు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే వివిధ రకాల నోటిఫికేషన్లను విడుద‌ల చేసిన‌ట్లు హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు.

హౌసింగ్ బోర్డు ఈసారి భూముల విక్రయాన్ని పూర్తిగా పారదర్శకంగా, ఆన్‌లైన్‌ మరియు బహిరంగ వేలాల రూపంలో నిర్వహిస్తోంది. గత వేలాల్లో భారీ ఆదాయం సమకూర్చుకున్న నేపథ్యంలో ఈ వేలంపాటలు కూడా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని అందించే అవకాశముంది.

Exit mobile version