న్యూ ఓర్లీన్స్ : అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో సోమవారం పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 25 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇంటర్ స్టేట్-55 రహదారిపై జరిగింది. దాదాపు 158 పైగా వాహనాలు పరస్పరం వేగంగా ఢీకొన్నాయి. అనంతరం మంటలు చెలరేగాయి.
న్యూ ఓర్లీన్స్ సమీపంలోని పాంట్ చార్లైయిన్ సమీపంలో ఘటనా స్థలంలో కార్లు, భారీ వాహనాలు కుప్పలు తెప్పలుగా పడిఉన్నాయి. దాదాపు 30 నిమిషాలపాటు వాహనాలు ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక దాని వెంట మరొకటి అలా ఢీకొంటూ ఉంటే.. అప్పటికే ప్రమాదానికి గురైనవారు, కార్ల నుంచి బయటకు వచ్చినవారు.. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.