ఎల్బీ స్టేడియం సంప్లో పడి చిన్నారి మృతి
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఉన్న సంప్లో పడి ఆరేండ్ల బాలుడు మరణించాడు. తన స్కూల్ క్రీడల కోసం స్టేడియానికి బాలుడు రాగా, ఈ ప్రమాదం సంభవించింది

- తన స్కూల్ క్రీడల కోసం స్టేడియానికి
- వెళ్లిన ఆరేండ్ల బాలుడు
విధాత: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఉన్న సంప్లో పడి ఆరేండ్ల బాలుడు మరణించాడు. తన స్కూల్ క్రీడల కోసం స్టేడియానికి బాలుడు రాగా, ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకీలోని సక్సెస్-ది హైస్కూల్కు చెందిన విద్యార్థి మహ్మద్ అహిల్ (6) మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన తన పాఠశాల క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. క్రీడా పోటీలు జరుగుతుండగా స్టేడియంలో బాలుడు కనిపించకుండాపోయాడు.
తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది రెండు గంటలపాటు విస్తృతంగా గాలించగా, స్టేడియంలో 12 అడుగుల లోతులో ఉన్న నీటి సంప్లో బాలుడు కనిపించాడు. బాలుడిని బయటకు తీసి హుటాహుటిన దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాఠశాల యాజమాన్యం, ఎల్బీ స్టేడియం యాజమాన్యం కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. సంప్పై కవర్ సరిగ్గా అమర్చలేదని, అందువల్లే చిన్నారి కాలుజారి నీటిలో మునిగిపోయాడని మండిపడ్డారు..