Site icon vidhaatha

మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు

విధాత: హీరోయిన్ త్రిషపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్రిషను రేప్ చేయాలనుందంటూ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.


దీంతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని భావించినట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇలాంటి వారి వల్లే పరిశ్రమలోని అందరికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. అతడితో నటించే అవకాశం రాకపోవడం సంతోషకరమన్నారు. మన్సూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇప్పటికే చిరంజీవి సహా పలువురు నటులు, పలు రంగాల ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ త్రిషకు మద్దతు పలికారు. మన్సూర్ సైతం త్రిషకు క్షమాపణలు చెప్పనని తెలిపారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు.


కాగా.. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్టా?’ అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. మన్సూర్ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) అతడిని పాక్షికంగా నిషేదించింది.

Exit mobile version