రిషి సునాక్ ఎన్నిక.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

విధాత: ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో తరచూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై తనదైన స్టైల్లో స్పందిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇవాళ భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పకనే చెప్పారు ఆనంద్ […]

  • By: krs    latest    Oct 25, 2022 3:14 AM IST
రిషి సునాక్ ఎన్నిక.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

విధాత: ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో తరచూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై తనదైన స్టైల్లో స్పందిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇవాళ భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పకనే చెప్పారు ఆనంద్ మహీంద్రా.

1947లో స్వాతంత్య్రం వచ్చిన వేళ.. ఇండియన్ లీడర్స్‌ అందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, నాయకుల్లో తక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్‌ చర్చిల్ అవహేళన చేశారు. కానీ భారత్‌కు ఇండిపెండెన్స్‌ వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన సమాధానం చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ ట్వీట్‌ చేశారు.

ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ పై చాలా మంది కామెంట్స్ తో కేక పుట్టిస్తున్నారు. భారత్‌కు చెందిన చాలా మంది విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న విషయాలను గుర్తు చేస్తున్నారు.