BJP విధాత: సహజంగా చాలా సందర్భాల్లో వాస్తవాలు ఆలస్యంగానే వెలుగులోకి వస్తాయి. అందుకు పరిస్థితుల ప్రభావం, వత్తిడి వంటి విషయాలు చాలానే వుంటాయి. మోదీ అమెరికా పర్యటనకు కూడా ఈ విషయాలు దాదాపు వర్తించవచ్చు. ఒక వైపు మోదదీ అమెరికా పర్యటనను హైలైట్ చేసిన బీజేపీ అది తమ పార్టీ, కేంద్రంలోని ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకొంటున్నది. పోగా.. దేశంలోని ప్రధాన మీడియా అంతా మోదీ పర్యటనను యథాలాపంగా ఎత్తి పట్టాయి. చారిత్రాత్మక పర్యటన అని […]
BJP
విధాత: సహజంగా చాలా సందర్భాల్లో వాస్తవాలు ఆలస్యంగానే వెలుగులోకి వస్తాయి. అందుకు పరిస్థితుల ప్రభావం, వత్తిడి వంటి విషయాలు చాలానే వుంటాయి. మోదీ అమెరికా పర్యటనకు కూడా ఈ విషయాలు దాదాపు వర్తించవచ్చు. ఒక వైపు మోదదీ అమెరికా పర్యటనను హైలైట్ చేసిన బీజేపీ అది తమ పార్టీ, కేంద్రంలోని ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకొంటున్నది. పోగా.. దేశంలోని ప్రధాన మీడియా అంతా మోదీ పర్యటనను యథాలాపంగా ఎత్తి పట్టాయి.
చారిత్రాత్మక పర్యటన అని వర్ణించాయి. మోదీ పర్యటన సాగుతున్నప్పుడు బయటకు వచ్చిన అధికార వార్తలు నాణానికి ఒకవైపు మాత్రమే! నాణానికి మరో వైపు మోదీ పర్యటన అనంతరం రోజులు గడుస్తున్న కొద్దీ బయటకు వెలువడుతున్న వార్తలు మోదీ అసలు రూపాన్ని ప్రపంచ ప్రజానీకానికి తెలియ బరుస్తున్నాయి.
మోదీ అమెరికా పర్యటన జూన్ 22నుండి కొనసాగింది. ఆ పర్యటన సందర్భంగా అనేక మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, మైనార్టీ సంక్షేమ సంఘాలు మోదీకి వ్యతిరేకంగా నిరసనలు, నల్లా జెండాలతో ప్రదర్శనలు పెద్ద ఎత్తున చేపట్టాయి. అయినా మన దేశ మీడియాకు అమెరికాలో జరిగే ఈ నిరసనలు కనబడలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధికారిక పర్యటన సందర్భంగా, అనేక పౌర సమాజ సంఘాలు భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన విషయాన్ని ప్రస్తావించాయి. మోదీ పాలనలో మానవ హక్కులు ఎలా కాలరాచి వేయబడుతున్నాయో, మైనార్టీల రక్షణ ఎలా ముప్పుగా తయారైందో వీటి అభిమానులు , ప్రేమికులు రోడ్ల పైకి వచ్చి మోదీ అమెరికా పర్యటనను నిరసిస్తూ తమ తమ దేశాలలో అమెరికా, భారత రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలకు దిగారు.
ఆ సంఘాల వారిలో ‘మానవ హక్కుల కోసం హిందువులు’, ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్’, ‘దళిత్ సాలిడారిటీ ఫోరమ్’, ‘అమెరికన్ మణిపూర్ ట్రైబల్ అసోసియేషన్’, ‘పీస్ యాక్షన్’ వంటి సంఘాలు వైట్హౌస్ వద్ద శాంతియుతంగా ప్రదర్శనలకు దిగిన వార్తలు ఇప్పుడు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.
భారతదేశంలోని మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులపై హింసాత్మక కేసులను కూడా సమూహాలు హైలైట్ చేశాయి.
భారతీయ ప్రవాసులు కూడా “హే జో (జో బైడెన్) ! మోదీని అడగండి!.. అంటూ అనేక అంశాలు ప్రస్తావించారు. భారతదేశంలోని సోషల్ మీడియా నుండి బీబీసీ డాక్యుమెంటరీని తీసివేయడం, కార్యకర్త ఉమర్ ఖలీద్కు జైలు శిక్ష, ఇతర సమస్యలు, హక్కుల ఉల్లంఘనను ముందుకు తెచ్చారు. మోదీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేసి ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజాతంత్రవాదులకు తమ వాయిస్ను తీసుకుపోయారు.
అంతేకాదు అమెరికాకు చెందిన 70 మంది సెనేట్స భ్యులు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ను కలిసి, భారత్లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనపై చర్చించి, మోదీపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఇంకా అనేక మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్లు పీఎం మోదీ సమావేశాన్ని బహిష్కరించారు, ఆమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వడాన్ని నిరసించారు.
మోదీ వ్యతిరేక ఈ కార్యకలాపాలను కొంత మేరకు అమెరికా మీడియా కూడా కవర్ చేసింది. టైమ్ మ్యాగజైన్లో వ్యాసం రాసిన ప్రముఖ జర్నలిస్టు.. అలీసా అయ్యర్.. మోదీకి రెడ్ కార్పెట్ పరచటాన్ని వ్యతిరేకించారు. ఇంకా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి భారత్లో ప్రజాతంత్ర శక్తులపై జరుగుతున్న దాడుల గురించి వ్యాసాలను ప్రచురించాయి.
ప్రపంచవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా పెల్లుబికిన ఈ గాలిని కప్పి పుచ్చడానికి కాషాయ శక్తులు ప్రయత్నించినా కూడా ఆలస్యంగానైనా ఇవి వెలుగులోకి రావడం.. మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులకు ఉత్సాహాన్ని ఇస్తాయి