విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

మనబడి, మనబస్తీతో పాఠశాలల అభివృద్ధి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ మర్కాజీ, ప్రాక్టీసింగ్ పాఠశాల విద్యార్థులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భోజనం చేశారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులకు అభ్యాసన దీపికలు, ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సంద‌ర్బంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి భోజ‌నం చేయ‌డం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా […]

  • By: Somu    latest    Feb 24, 2023 12:21 PM IST
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
  • మనబడి, మనబస్తీతో పాఠశాలల అభివృద్ధి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ మర్కాజీ, ప్రాక్టీసింగ్ పాఠశాల విద్యార్థులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భోజనం చేశారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులకు అభ్యాసన దీపికలు, ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ సంద‌ర్బంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి భోజ‌నం చేయ‌డం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా “మన బస్తీ మనబడి” కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమములో భాగంగా 12రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఈ సందర్భంగా విద్యార్థుల విజ్ఞానానికై అభ్యసన దీపికాలు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుందరికీ పరీక్షలు రాయడానికి ఆవసరమయ్యే పరికరాలను అందించిన సంతోష్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నం మధు, సోద కిరణ్, ఎలకంటి రాములు జిల్లా విద్యాధికారి అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు.