రాజస్థాన్ లోని జైపూర్ లో శుక్రవారం ఓ వ్యాపారి నుంచి దుండగులు రూ. 33 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు అగంతకులు ఆ వ్యాపారి కళ్ళల్లో కారం కొట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ లో శుక్రవారం ఓ వ్యాపారి నుంచి దుండగులు రూ. 33 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు అగంతకులు ఆ వ్యాపారి కళ్ళల్లో కారం కొట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. విద్యాధర్ నగర్ లోని గర్వ్ ఖండే వాల్ నివాసి వ్యాపారస్థుడు కారులో కూర్చోగానే చేతిలోని బ్యాగ్ ని ఈ దుండగులు లాక్కొని పారిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్భందనం చేశారు. అయినా దొంగల జాడ దొరకక పోవడంతో ఘటనా స్థలంలో అమర్చిన సిసిటీవీ ఫుటేజీని పరిశీలించారు.
పుటేజీ ఆధారంగా దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. విశ్వకర్మలో మెటల్ ఫ్యాక్టరీ నడుపుతున్న ఈ వ్యాపారి డబ్బు తీసుకునేందుకు స్నేహితుడితో కలిసి శుక్రవారం సాయంత్రం విద్యాధర నగర్ లోని ధనశ్రీ టవర్ కు వచ్చాడు. బ్యాగులో సుమారు రూ.33 లక్షలు పెట్టి కారులో కూర్చున్నారు. ఇంతలో కాలినడకన వస్తున్న ఇద్దరు అగంతకులు వెనుక నుంచి వచ్చి ఆయన కళ్ళల్లో కారం చల్లారు. బాధతో కేకలు వేస్తుండగా ఆగంతకులు ఆయన చేతిలోని నగదు బ్యాగును లాక్కొని పారిపోయారు.