CM KCR | క్యాడర్‌లో అసంతృప్తి తగ్గించండి.. ప్రజల్లో ఉండి పని చేసే వారికే టికెట్లు: సీఎం కేసీఆర్

CM KCR క్యాడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టండి పల్లె నిద్రతో జనంతో మమేకం కండి వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తాం సిటింగ్‌లకే టికెట్లు వస్తాయనే నమ్మకంతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ షాక్‌ లాంటి వార్త చెప్పారు. ప్రజల్లో ఉంటూ, బాగా పని చేసే వారికే ఈసారి టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన కేసీఆర్‌.. ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి వెళ్లాలని, […]

  • Publish Date - April 27, 2023 / 12:46 AM IST

CM KCR

  • క్యాడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టండి
  • పల్లె నిద్రతో జనంతో మమేకం కండి
  • వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తాం

సిటింగ్‌లకే టికెట్లు వస్తాయనే నమ్మకంతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ షాక్‌ లాంటి వార్త చెప్పారు. ప్రజల్లో ఉంటూ, బాగా పని చేసే వారికే ఈసారి టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన కేసీఆర్‌.. ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల్లోనే ఉండాలని సూచించారని, ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే ఈసారి టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారని విశ్వసనీయంగా తెలిసింది.

విధాత: పార్టీ క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తని తగ్గించే చర్యలు చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్ల్యేలు, నాయకులను బీఆర్‌ ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదేశించారు. ఈ మేరకు నాయకులంతా ప్రజలకు దగ్గర కావాలన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని నాయకులకు దిశానిర్దేశనం చేశారు.

వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో గెలుస్తామని ప్రకటించి పార్టీ క్యాడర్‌కు బూస్టింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి టీవీ యాడ్స్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కూడా మన పార్టీ భవిష్యత్‌లో చేపట్టవచ్చునన్నారు.

అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా నడుపవచ్చునన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సభ జరిగింది.

ప్రతినిధుల సభలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్‌ ఉదయమే తెలంగాణ భవన్‌కు వచ్చారు. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆతరువాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ ప్రతినిధుల సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని, వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామని ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో గెలువడానికి నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశమన్నారు. ‘‘ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదన్నారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియ జేయగలిగామన్నారు. అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ప్రజల్లో ఉండి పనిచేసేవారికే టికెట్లు

సిటింగ్‌లకే టికెట్లు వస్తాయనే నమ్మకంతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ షాక్‌ లాంటి వార్త చెప్పారు. ప్రజల్లో ఉంటూ, బాగా పని చేసే వారికే ఈసారి టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన కేసీఆర్‌.. ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల్లోనే ఉండాలని సూచించారని, ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే ఈసారి టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారని విశ్వసనీయంగా తెలిసింది.

కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారని తెలిపారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువన్నారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పించి, మనం ఎలా ముందుకు పోవాలని మేధోమదనం చేశానన్నారు.

తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాట వేసి ముందుకు పోతున్నామని తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదని ఆరోపించారు. మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నదన్నారు. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదని అన్నారు. 2021-2022 కు ముందు జీఎస్టీ ఆదాయం రూ.34 వేల కోట్లు వుంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా రూ. 44 వేల కోట్లు పెట్టుకున్నామన్నారు.

అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయాలని సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖను ఆదేశించారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరిగానే కొంటామని, ఈ మేరకు మార్క్ ఫెడ్ కు ఆదేశాలిస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నదన్నారు. దేశ జీఎస్డీపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతంగా ఉన్నదన్నారు.

కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి సర్వే చేసి నెంబర్లు వేసి నా ఆఫీసులో ఇవ్వండని నాయకులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దామన్నారు. మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలుగా ఈ అవకాశాన్నిఉపయోగించు కోవాలన్నారు. మూడు నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలన్నారు.

మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎపి తలసరి ఆదాయం రూ. 2,19,518 ఉందని, ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ అని అన్నారు. ఇంతకన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు 16, 17 వరకు ఉన్నాయని తెలిపారు. తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చునన్నారు.

మధ్యాహ్నం 12.45 గంటల వరకే అక్కడకు చేరుకోండి

కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మధ్యాహ్నం 12.45 కల్లా అక్కడికి చేరుకోవాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 వరకు మంత్రులు వారి వారి చాంబర్స్ కు వెళ్లాలని ఆదేశించారు.

సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్ ఉంటుందని, లంచ్ తర్వాత డిస్పోస్ కావాలన్నారు. మెయిన్ గేట్ సీఎం, మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలకు ఉద్దేశించిందన్నారు. నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించిందన్నారు. సౌత్ ఇస్ట్ జనరల్ విసిటర్స్ కు ఉద్దేశించిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం ముగిసిన తరువాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ పలు తీర్మానాలు ప్రవేశ పెట్టారు.