విధాత: సైబరాబాద్ ఎస్వోటీ బృందాలు మద్యం బెల్ట్షాపులపై ముమ్మర దాడులు నిర్వహించాయి. సైబరాదాద్ కమిషనరేట్ వ్యాప్తంగా 8 పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ లపై దాడి చేసి 7లక్షల 47,368విలువైన 796.05 లీటర్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్స్ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా ఎస్వోటీ మేడ్చల్ ఎస్వోటీ టీమ్ పట్టుకుంది.
మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో 45.2 లీటర్లు, రాజేంద్రనగర్ స్టేషన్ పరిధిలో 94..78, శామీర్పేట్ పీఎస్ పరిధిలో 11.25,,బాచుపల్లి పరిధిలో 55.8, మైలార్దేవ్పల్లి పరిధిలో 17.4, నందిగామ పీఎస్ పరిధిలో 19.14, దుండిగల్ పరిధిలో 6.43 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.