ఉద్యమ ఆకాంక్షలు నీరు కార్చిన ప్రభుత్వం మొదటి దశాబ్దిలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే సంబరాలు కాదు, వాస్తవాలకు అనుగుణంగా పనిచేయాలి ఏం సాధించారని ఈ ఉత్సవాలు సంబరాలు విధాత బ్యూరో, కరీంనగర్ : దశాబ్ది ఉత్సవాల పేరిట అధికార పార్టీ చేస్తున్న ఆర్భాటాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని, ఉద్యమ కాలం నాటి ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందని శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డి (MLC Jeevan […]
విధాత బ్యూరో, కరీంనగర్ : దశాబ్ది ఉత్సవాల పేరిట అధికార పార్టీ చేస్తున్న ఆర్భాటాలు చూస్తే
ఆశ్చర్యం కలుగుతోందని, ఉద్యమ కాలం నాటి ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందని శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి దశాబ్దిలో బాగుపడింది ముఖ్యమంత్రి కుటుంబమేనని, వచ్చే దశాబ్దిలో పేద ప్రజల సంగతి చూస్తామని చెబుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ఎవరిని మభ్యపెడుతున్నారు? ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఉద్యమ కాలంనాటి నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోనప్పుడు
ఏం సాధించామని ఉత్సవాలు, సంబరాలు జరుపుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కమిషన్ల కక్కుర్తి కోసమే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బ్యారేజీల నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మోటార్ల కొనుగోలు నుండి ప్రతి ఒక్కటి కమిషన్లతో ముడివడి ఉందని ఆయన చెప్పారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని, చదువు లేని వారికి కులవృత్తులు చేసుకొనే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది సంబరాలను పక్కనపెట్టి వాస్తవాలకు అనుగుణంగా పని చేయలన్నారు