రిజర్వేషన్ల రద్ధు అంశంపై అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కే మేలు చేస్తుందని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు
విధాత : రిజర్వేషన్ల రద్ధు అంశంపై అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కే మేలు చేస్తుందని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రేవంత్రెడ్డిని అరెస్టు చేస్తే అప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన జార్ఞండ్, ఢిల్లీ, తెలంగాణ సీఎంలు ముగ్గురు జైళ్లో ఉన్నట్లు అవుతుందని నారాయణ పేర్కోన్నారు. ఆ పరిణామాలు ఎన్నికల్లో బీజేపీకే చేటు చేస్తాయన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న సీఎంలు దొంగలు అయినా వారు మంచివారేనని, ప్రశ్నించే ప్రతిపక్షాల సీఎంలను మాత్రం జైళ్లకు పంపిస్తారని నారాయణ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డిని కూడా జైలుకి పంపించాలని మోదీ చూస్తున్నారని నారాయణ ఆరోపించారు. నిజానికి దేశ ద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తె మోదీని, రెండవ వ్యక్తిగా అమిత్ షాలను అరెస్ట్ చేయాలని నారాయణ మండిపడ్డారు. కేసీఆర్ ఎంపీగా గెలిస్తే నామా నాగేశ్వరరావును మంత్రిని చేస్తాడంటున్నాడని, కేసీఆర్కే దిక్కు లేదు ఇక నామాను మంత్రిని చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. మోదీ మూడవసారి ప్రధాని అయ్యి, 400 సీట్లు వస్తే భారతదేశం మారిపోయి పూర్తి హిందూ దేశంగా మారుతుందని విమర్శించారు. ఇక దేశంలో ముస్లింలు అనే వారు ఉండరని, మూడవసారి మోదీ పాలన అలా ఉంటుందని ఆరోపించారు. నరేంద్ర మోదీ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, మరోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నించవచ్చన్నారు. సీపీఐ ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని గెలిపించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు.