విధాత: బీజేపీ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తనకు ప్రాణహాని ఉందంటూ తగిన భద్రత కల్పించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్ను విచారించిన రాష్ట్ర హైకోర్టు రెండు వారాల్లోగా రాజగోపాల్ రెడ్డికి టు ప్లస్ టు గన్ మెన్ లతో భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.