బాధ్యతలు స్వీకరించిన భట్టి.. పలు శాఖలకు నిధుల జాతర
ఆరు గ్యారంటీల అమలు పురోగతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి సబంధించి 374కోట్లు విడుదల చేసింది.

సబ్సిడీలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి
విధాత : ఆరు గ్యారంటీల అమలు పురోగతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి సబంధించి 374కోట్లు విడుదల చేసింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు విడుద చేయగా, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు… pic.twitter.com/2i9n1r04kz
— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 14, 2023
ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయా శాఖలకు సబ్సిడీలను విడుదల చేసి, సమ్మక్క, సారక్క జాతరకు నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి..నిధుల సమీకరణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమన్వయం చేసుకుంటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధుల మంజూరీ కొనసాగిస్తుంది.
ఈరోజు తెల్లవారుజామున మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అర్థిక & విద్యుత్ శాఖల మంత్రివర్యులైన “గౌ” శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.#BhattiVikramarkaMallu pic.twitter.com/nyOfjfFQIz
— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 14, 2023