మునుగోడు అభివృద్ధి బాధ్యత మాదే: మంత్రి గంగుల
విధాత: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఊరూరా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కదులుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ సంస్థాన్ నారాయణపురంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని మంత్రి […]

విధాత: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఊరూరా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కదులుతున్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ సంస్థాన్ నారాయణపురంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆయన ఏ రోజైనా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడారా? అని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా మునుగోడు అభివృద్ధి కుంటుపడింది.